Sunday, April 3, 2011

ఒక మధురానుభూతి....

అనిర్వచనీయం ఆ మధుర క్షణాలు... ఒక గొప్ప అనుభూతి ఎలా ఉంటుందో తెల్సుకోవాలంటే ఇంతకు మించిన అనుభవం ఇంకోటి ఉండదేమో...
ఎన్నో సంవత్సరాలుగా సాధించాలి అని తాపత్రయ పడుతున్న ఒక విజయంలోని మజా తెలియాలంటే దీనిని మించింది ఇంకోటి ఉండదేమో...
ఆ మధుర క్షణాల్లో సాధించిన వాళ్ళలో వచ్చేవి ఆనంద భాష్పాలు కావు, మధురానంద భాష్పాలు కుడా కావు.. అవి కన్నీళ్ళు... ఎన్నో సంవత్సారాలుగా వారు పడ్డ కష్టాలకు ఒక్కసారిగా వచ్చిన కన్నీళ్లు... అద్భుతం.. మహాద్భుతం... ఇంతకు మించిన ఆనందం వాళ్లలోనే కదూ ప్రతి భారతీయుడిలోను ఇంకెప్పుడు ఉండదు...

మానవతావాదం తో చెప్పుకోవాలంటే, ఎంతో మందికి ప్రాణాలు పోసింది ఈ కప్పు.. ఎందుకంటే ఆసిస్ తో మాచ్ గెలువకున్న, పాక్ తో మాచ్ గెలువకున్న, ముఖ్యంగా ఈ మాచ్ లో కూడా గెలువకపోయినా ఖచ్చితంగా, ఎన్నో కొన్ని ప్రాణాలు మాత్రం పోయేవే... ఈ దృష్టి తో చెప్పుకుంటే, ఏంటో మందికి జీవం పోసింది, ఎంతో మంది తల్లులకు గర్భ శోఖాన్ని కలుగకుండా చేసింది....
అదే మన విజయం... క్రికెట్లో భారత్ ప్రపంచ కప్పు ను గెలిచినా క్షణాలు మాటలతో చెప్పలేనివి, పదాల్లో రాయలేనివి...

ఇట్లు,
మీ దీపం,

No comments: